News December 29, 2025

సిద్దిపేట: 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సమాయత్తం

image

సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల వివరాలు.. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా జనాభా 16,544 మంది కాగా ఎస్టీలు 93, ఎస్సీలు 3,453 మంది ఉన్నారు. దుబ్బాకలో 20 వార్డులు ఉండగా జనాభా 27,496 మంది కాగా ఎస్టీలు 238, ఎస్సీలు 4,478 మంది, గజ్వేల్‌లో 20 వార్డులు ఉండగా జనాభా 37,881 మంది కాగా ఎస్టీలు 649, ఎస్సీలు 3,460, హుస్నాబాద్‌లో 20వార్డులు ఉండగా జనాభా 22,082మంది కాగా ఎస్టీలు 769, ఎస్సీలు 4,322 మంది.

Similar News

News January 11, 2026

సంగారెడ్డి: ఈనెల 12న ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఈనెల 12న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారని, ఈ సందర్భంగా ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.

News January 11, 2026

సిద్దిపేట: ‘ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి’

image

రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాంపల్లిలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని లేకపోతే PM కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవరోధం ఏర్పడుతుందన్నారు.

News January 11, 2026

వర్ధన్నపేట: NH-563పై మృత్యుశకటాలు

image

వర్ధన్నపేట శివారులోని కెనాల్ నుంచి మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానిక అవసరాల పేరుతో పర్మిషన్లు తెచ్చుకుని పదుల సంఖ్యలో లారీలతో వరంగల్‌కు మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. NH-563పై లారీలు అతివేగంతో దూసుకెళ్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేత అండదండలతోనే దందా సాగుతోందని, అందుకే అధికారులు పట్టించకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.