News April 24, 2024
బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు: చంద్రబాబు

ఎస్.కోట నియోజకవర్గంలో నిన్న జరిగిన సమావేశంలో బొత్సపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖపైనే ఆధారపడతారని..కానీ ఈ నియోజకవర్గాన్ని విశాఖలో కలపకుండా విజయనగరంలో ఉంచారని అన్నారు. ఇదంతా బొత్స డ్రామాలాడి చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Similar News
News March 25, 2026
విజయనగరం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం రాజాం ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
News March 25, 2026
పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.


