News April 24, 2024
NRPT: ఉద్యోగం రావడంలేదని యువకుడి సూసైడ్

ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు.. మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన శివకుమార్(23) గ్రూప్, ఇతర పోటీ పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో తోటివారికి ఉద్యోగాలు వచ్చి తనకు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.
Similar News
News March 18, 2026
మహబూబ్నగర్: ‘వేసవిలో నీటి సమస్య తలెత్తకూడదు’

మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి రాకుండా చూడాలని మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మూడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 60 డివిజన్లలో ఎప్పటికప్పుడు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News March 18, 2026
మన్యంకొండలో వసంత నవరాత్రులు

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 28 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, 28న శ్రీరామ నవమి వేడుకలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 29న శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.
News March 18, 2026
MBNR : ఉడిత్యాలలో 36.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బాలానగర్ 30.8, నవాబుపేట మండలం కొల్లూరు 26.3, మిడ్జిల్ 21.5, నవాబుపేట 15.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 12.5, మహబూబ్ నగర్ అర్బన్ 11.7, జడ్చర్ల 10.3, మహమ్మదాబాద్ 9.3, గండేడ్ మండలం సల్కర్ పేట 5.5, దేవరకద్ర 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.


