News December 30, 2025
భద్రాద్రి జిల్లాలో మరోసారి ఎన్నికలు

భద్రాద్రి జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో పోలింగ్కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. కొత్తగూడెం కార్పొరేషన్ – 60 వార్డులు 1,70,897 మంది జనాభా, ఇల్లందు-24 వార్డుల్లో 33,732మంది, అశ్వారావుపేట- 22 వార్డుల్లో 20,040మంది ఉన్నారు. ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
Similar News
News December 31, 2025
NRPT: వీధి కుక్కల బీభత్సం.. చిన్నారిపై దాడి

ఊట్కూర్లో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. గాంధీనగర్ వీధికి చెందిన ఓ పసిపాపపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బుడ్లపోల రాజు కుమార్తె అక్షిత చిన్నారి వారి ఇంటి పరిసరాలలో ఆడుకుంటుంది. ఆ సమయంలో 2 వీధి కుక్కలు అక్కడకు చేరుకొని అక్షితపై దాడికి పాల్పడ్డాయి. దీంతో చిన్నారి ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కలను తరిమి చిన్నారిని MBNR ఆసుపత్రికి తరలించారు.
News December 31, 2025
ఏంటీ AGR రచ్చ? వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఇచ్చిన ఊరట ఇదే!

వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం భారీ ఊరటనిచ్చింది. AGR అనేది టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు. తమకు కేవలం ఫోన్ కాల్స్, డేటా ద్వారా వచ్చే ఆదాయంపైనే ఫీజు వేయాలని కంపెనీలు వాదించగా.. అద్దెలు, డివిడెండ్లు సహా ఇతర ఆదాయాలను కూడా కలపాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికే మద్దతు తెలపడంతో కంపెనీలపై ₹వేల కోట్ల అదనపు భారం పడింది.
News December 31, 2025
తెలుగు ప్రజలకు నేతల శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు CMలు, నేతలు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ‘పింఛన్లు అందుకున్న లబ్దిదారులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు’ అని CM CBN ట్వీట్ చేశారు. ‘కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలును చేరుకోవాలని’ అని CM రేవంత్ ఆకాంక్షించారు. ‘2026లో కూటమి మరింత మెరుగైన సేవలందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది’ అని పవన్ ట్వీట్ చేశారు. ‘కొత్త ఏడాది ప్రతొక్కరి ఇంట్లో ఆనందం నింపాలని’ జగన్ కోరుకున్నారు.


