News December 30, 2025

ఇష్టారాజ్యంగా ఛార్జీల వసూళ్లు.. కలెక్టర్ సీరియస్

image

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తుల వద్ద అద్దె గదుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. జాతర సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అదనంగా వసూలు చేయకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక కమిటీ వేస్తామని RDO రాధాబాయి ఈ సందర్భంగా అన్నారు.

Similar News

News January 7, 2026

అమరావతిలో నేటి నుంచి మరోసారి ల్యాండ్ పూలింగ్

image

అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం బుధవారం నుంచి మరోసారి భూసమీకరణ ప్రారంభించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1,937 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు, కాగా పల్నాడు(D) అమరావతి మండలంలోని వైకుంఠపురం 3,361 ఎకరాలు, పెదమద్దూరు 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166, కర్లపూడి-లేమల్లె 2,944 ఎకరాలుగా సమీకరణ చేయనుంది.

News January 7, 2026

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై బస్సు దగ్ధం.. విచారణ వేగవంతం

image

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై జరిగిన RRR ట్రావెల్స్ <<18784837>>బస్సు ప్రమాద<<>> ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారగా..బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమ్యస్థానాలకు చేర్చారు. ఫిట్‌నెస్ నిబంధనలపై RTO ఆరా తీస్తున్నారు.

News January 7, 2026

NRPT: 90 గంటల పాటు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

image

నారాయణపేట మండలం ఏలూరు వద్ద బటర్‌ఫ్లై వాల్వ్ మరమ్మతుల కారణంగా మక్తల్ నియోజకవర్గంలో నేటి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్ల జిల్లాలోని 8 మండలాలు, 184 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలకు 90 గంటల పాటు అంతరాయం కలగనుంది. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.