News December 30, 2025

రామచంద్రపురం: సంక్రాంతికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లేవారి కోసం హెచ్‌ఈఎల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు నడుస్తాయి. ఆర్సీపురం నుంచి బయలుదేరే ఈ బస్సులు బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

Similar News

News January 8, 2026

క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.

News January 8, 2026

ఉప్పలపాడులో పాస్ పుస్తకాలను అందజేసిన కలెక్టర్

image

ముదిగుబ్బ మండలం ఉప్పలపాడులో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

News January 8, 2026

HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

image

సిటీ నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక టికెట్ ధరలు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.