News December 30, 2025

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కలెక్టర్ కీలక ఆదేశం

image

జిల్లాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం పాశర్లపూడి జంక్షన్ వద్ద 216 బైపాస్ రోడ్డు పనులను ఆర్డీఓ మాధవితో కలిసి ఆయన పరిశీలించారు. రవాణా సౌకర్యాల మెరుగుదల, ప్రజల భద్రతే లక్ష్యంగా పనులు జరగాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News January 11, 2026

యాదగిరిగుట్ట: రేపే గిరిప్రదక్షిణ.. దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

image

శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం (స్వాతి నక్షత్రం) పురస్కరించుకుని సోమవారం ఉదయం 5:30 గంటలకు గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ఈ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అనంతరం భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాద వితరణ ఉంటుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

News January 11, 2026

హన్మకొండ: యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూసైడ్

image

హసన్‌పర్తి మండలం చింతగట్టు రైల్వే గేట్ వద్ద <<18830665>>మృతి చెందిన<<>> వ్యక్తిని అతని స్నేహితులు గుర్తించారు. మృతుడు నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన దూడే రాజుగా తెలిపారు. మృతుడు యూత్ కాంగ్రెస్ పరకాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పల్సర్ బైకును పక్కన పెట్టి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 11, 2026

చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

image

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.