News December 30, 2025
మారనున్న తూర్పుగోదావరి రూపురేఖలు

కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ మూడు మండలాల ప్రజలు రాజమండ్రి ఆర్డీవో పరిధిలో సేవలు పొందనున్నారు. గత కొంతకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News January 11, 2026
పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.
News January 11, 2026
ఖేలో ఇండియాలో ఏపీకి రజతం.. దేవరపల్లి క్రీడాకారుల ప్రతిభ!

గుజరాత్లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్లో ఏపీ సెపక్ తక్రా జట్టు రెండోస్థానం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో బీహార్పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏపీ జట్టులో ప్రతిభచాటిన దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిలను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 11, 2026
రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.


