News December 30, 2025
31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 303 కొత్త పెన్షన్లతో కలిపి మొత్తం 2,28,592 పెన్షన్లకు రూ.98.95 కోట్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్లు ఇంటింటికీ సజావుగా అందేలా క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 12, 2026
MHBD జిల్లాలో యూరియా కొరత లేదు: ADA

జిల్లా వ్యాప్తంగా 571 యూరియా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సరిత తెలిపారు. PACS ఆధ్వర్యంలో 439, ప్రైవేట్ డీలర్స్, అదనపు సహకార శాఖ కేంద్రాలు 20, రైతు సేవ ఆగ్రోస్, ODCMC, మొదలగు కేంద్రాలు 112 ద్వారా యూరియా పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఖరీఫ్ సీజన్లో 2లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా, ఇప్పటికే 2లక్షల 25 వేల టన్నులు సేకరించామన్నారు.
News January 12, 2026
ప్రజావాణిలో 66 దరఖాస్తులు స్వీకరణ: అడిషనల్ కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల వద్ద నుంచి 66 ఫిర్యాదులు స్వీకరించామని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డోర్నకల్, మహబూబాబాద్, గూడూరు, పెద్ద వంగర మండలాల నుంచి ప్రజలు పలు సమస్యలపై దరఖాస్తులు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ పురుషోత్తం, మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
News January 12, 2026
నల్గొండ: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. CSతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


