News December 31, 2025
PGRSలో 9,300 సమస్యలు పరిష్కారం: కడప ఎస్పీ

కడప జిల్లాలో 2025 ఏడాదికి ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక(PGRS)లో 9,704 పిర్యాదులు వచ్చాయని.. వాటిలో 9,300 ఫిర్యాదులు నిర్ణీత గడువులోపు పరిష్కరించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ప్రజాసేవ, సమాజంలో భాగస్వామ్యం, చట్టం అమలులో ఉన్నత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందినట్లు తెలిపారు. 2026లో మరింత అంకితభావంతో ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తామని తెలిపారు.
Similar News
News January 1, 2026
ప్రొద్దుటూరు: వారం రోజుల్లో తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల వ్యవధిలో రూ.5510 మేర తగ్గింది. ఇవాళ 10 గ్రాముల ధర ఇవాళ 1,37,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,060 తగ్గి రూ.1,26,320 దగ్గర ఆగింది. అయితే వెండి మాత్రం కేజీ రూ.1,500 పెరిగింది. దీంతో ఇవాళ రూ.2,37,000కి చేరింది.
News January 1, 2026
ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.
News January 1, 2026
ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.


