News April 24, 2024

కామారెడ్డి : మంటలంటుకుని రైతు మృతి

image

బీర్కూర్ మండల కేంద్రానికి అరిగె చిన్నరాములు(64) అనే వ్యక్తి తన పొలంలోని వరికొయ్యలకు సోమవారం నిప్పుపెట్టాడు. దీంతో భారీగా పొగ అతన్ని తాకడంతో సృహతప్పి పొలంలోనే పడిపోయాడు. మంటలు చెలరేగి అతన్ని చుట్టు ముట్టడంతో చిన్నరాములు సజీవ దహనమయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లిన రాములు ఇంకా రాలేదని అతని కుమారుడు పొలం వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News January 11, 2026

నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

image

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.

News January 11, 2026

నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

image

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.

News January 10, 2026

NZB: సంక్రాతి సెలవులకు ఊర్లకు వెళ్లే వారికి ముఖ్య సూచనలు

image

సంక్రాంతి సెలవులకు సొంత గ్రామాలకు వెళ్లే వారికి నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ముఖ్య సూచనలు చేశారు. ఖరీదైన వస్తువులు, డబ్బు, బంగారం బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దన్నారు. ఇంటికి బలమైన తాళాలు, సెంట్రల్ లాకింగ్ ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.