News December 31, 2025

2025: 657 మంది మిస్సింగ్.. 593 మంది ఆచూకీ లభ్యం: ఎస్పీ

image

2024 ఏడాదిలో 571 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 540 మంది ఆచూకి కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 2025 ఏడాదిలో 657 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 593 మంది ఆచూకి గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. గత ఏడాది 222 చీటింగ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 221 కేసులు నమోదయ్యాయని వివరించారు.

Similar News

News January 1, 2026

ప్రొద్దుటూరు: వారం రోజుల్లో తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల వ్యవధిలో రూ.5510 మేర తగ్గింది. ఇవాళ 10 గ్రాముల ధర ఇవాళ 1,37,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,060 తగ్గి రూ.1,26,320 దగ్గర ఆగింది. అయితే వెండి మాత్రం కేజీ రూ.1,500 పెరిగింది. దీంతో ఇవాళ రూ.2,37,000కి చేరింది.

News January 1, 2026

ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

image

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.

News January 1, 2026

ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

image

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.