News December 31, 2025

ఇకపై అన్నీ మదనపల్లెలోనే..?

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె నేటి నుంచి అమల్లోకి రానుంది. ఇక్కడి నుంచే పాలన కొనసాగనుంది. మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయనున్నారు. రాయచోటిలో నిన్న ఎస్పీ ధీరజ్ చివరి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ గ్రీవెన్స్ ఇకపై మదనపల్లెలోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ సైతం ఇకపై మదనపల్లె నుంచే తన డ్యూటీ నిర్వహిస్తారు.

Similar News

News January 1, 2026

శాతవాహన పరిశోధన అభివృద్ధి కేంద్ర సంచాలకులుగా డాక్టర్ జాఫర్

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ & డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ గా డా.మహమ్మద్ జాఫర్ నియమకయ్యరు. ఈ మేరకు SU VC ఆచార్య యు.ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. జాఫర్ ఉర్దూ విభాగంలో సహ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ గా పని చేశారు. 2020లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు అందుకున్నారు.

News January 1, 2026

కుష్టు వ్యాధి సర్వే పూర్తి: DMHO తుకారం రాథోడ్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తయినట్లుగా DM&HO డా.తుకారం రాథోడ్ తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు జరిగిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో 1,436 బృందాలు పాల్గొని 2,47,693 ఇళ్లను సందర్శించారని చెప్పారు. మొత్తం 8,89,635 మందిని క్షుణ్ణంగా పరిశీలించి 1,708 మంది కుష్ఠు అనుమానితులుగా గుర్తించామన్నారు. వారికి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు.

News January 1, 2026

శాతవాహన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా డా.కే.పద్మావతి

image

శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ కే.పద్మావతి SU VC యు.ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. సమాజ శాస్ర సహా ఆచార్యులుగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. 2008లో సహాయ ఆచార్యులుగా నియామకమై తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్డి టు విసి డా.డి హరికాంత్ ఉన్నారు.