News April 24, 2024
ప్రకాశం: పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266

జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.
Similar News
News March 31, 2026
మార్కాపురం ప్రమాద ఘటన..పోలీసుల అలర్ట్!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి కూడా పోలీసులు హైవేలపై తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
News March 31, 2026
మార్కాపురం ప్రమాద ఘటన..పోలీసుల అలర్ట్!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి కూడా పోలీసులు హైవేలపై తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
News March 31, 2026
ప్రకాశం: లారీని ఢీకొన్న మ్యాజిక్ వాహనం.. మహిళ దుర్మరణం

వరికుంటపాడు (M) తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని తిరగల దిన్నె వద్ద ఆగి ఉన్న లారీని మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని హుటాహుటిన కందుకూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సోమవారం రాత్రి ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


