News December 31, 2025
ప్రకాశం పుష్కలం.!

ప్రకాశం జిల్లాను ప్రకటించడంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులేసిందనే చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం విడిపోగానే, ఆ స్థానాన్ని అద్దంకి, కందుకూరు డివిజన్లతో భర్తీ చేసింది. బాపట్ల జిల్లాలోని అద్దంకిని, నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లను ప్రకాశంలోకి కలపడంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు ప్రజలకు నెల్లూరు 102 కి.మీ దూరం ఉండగా, ఒంగోలు 43 కి.మీ దూరంలోనే ఉంది.
Similar News
News January 2, 2026
రేపే TDP ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడి ప్రమాణం

టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని నాయకులు తెలిపారు. ఒంగోలు పట్టణంలోని SGVS కళ్యాణ మండపంలో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
News January 2, 2026
BREAKING మార్కాపురం జిల్లాలో మర్డర్!

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం బీసీ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న జయంపు కృష్ణయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
ఆదర్శంగా ప్రకాశం కలెక్టర్..!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బొకేలు ఎవరూ తీసుకు రావద్దని, కేవలం విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకురావాలని కలెక్టర్ ముందుగా సూచించారు. అధికారులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. పెద్ద మొత్తంలో వచ్చిన పుస్తకాలను త్వరలో విద్యార్థులకు అందించనున్నారు.


