News December 31, 2025
మెదక్ జిల్లాలో మహిళల భద్రతకు షీటీమ్స్: ఎస్పీ

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్లో ఈవ్ టీజింగ్ కేసుల్లో 2 ఎఫ్ఐఆర్లు, 7 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 64 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో 38 అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వేధింపులకు గురైతే 100 లేదా షీ టీమ్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News January 1, 2026
భారీ పొగమంచు.. వాహనదారులకు ఎస్పీ అలర్ట్

మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ప్రధాన, జాతీయ రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పొగమంచు సమయంలో వేగం తగ్గించి, హెడ్లైట్లు ఆన్ చేసి, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని తెలిపారు. ద్విచక్ర, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.
News January 1, 2026
మెదక్: భార్యను హత్య చేసిన భర్త.. జీవిత ఖైదు

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.
News January 1, 2026
మెదక్: ముగ్గురు పోలీస్ అధికారులకు సేవ పథకాలు

మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్కు ఉత్తమ సేవ పథకం, ఎస్ఐ విఠల్కు సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగంకు సేవ పథకం ప్రకటించారు. ఎంపికైన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు. భవిష్యత్లో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


