News April 24, 2024
మీ క్షమాపణ.. యాడ్ సైజ్లోనే ఉందా? పతంజలిపై సుప్రీం ఫైర్

తప్పుడు ప్రకటనల కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడిన పతంజలిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. బాబా రాందేవ్, బాలకృష్ణ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ ‘కోర్టును క్షమాపణ కోరుతూ పతంజలి రూ.10లక్షల ఖర్చుతో 67 న్యూస్ పేపర్లలో ప్రకటన ఇచ్చింది’ అని కోర్టుకు తెలిపారు. దీంతో ‘మీరిచ్చిన యాడ్స్ సైజ్, ఫాంట్ తరహాలోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా?’ అని SC ప్రశ్నించింది. తదుపరి విచారణను 30కి వాయిదా వేసింది.
Similar News
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.


