News December 31, 2025

సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

image

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు.

Similar News

News January 7, 2026

NRPT: 90 గంటల పాటు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

image

నారాయణపేట మండలం ఏలూరు వద్ద బటర్‌ఫ్లై వాల్వ్ మరమ్మతుల కారణంగా మక్తల్ నియోజకవర్గంలో నేటి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్ల జిల్లాలోని 8 మండలాలు, 184 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలకు 90 గంటల పాటు అంతరాయం కలగనుంది. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News January 7, 2026

పాలమూరు: ‘నో హెల్మెట్.. నో ఫ్యూయల్’

image

“నో హెల్మెట్ – నో ఫ్యూయల్” అనే నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భగవంత్ రెడ్డి తెలిపారు. హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంక్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంక్ యజమానులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

News January 7, 2026

రీ- సర్వే పక్కాగా జరగాలి: బాపట్ల కలెక్టర్

image

రీ- సర్వే పక్కాగా జరగాలని, అప్పుడే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్‌లైన్లో రికార్డు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రెవెన్యూ సమస్యలపై సమీక్ష ఉంటుందని తెలిపారు.