News April 24, 2024

విశాఖ ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది: జగన్

image

AP: విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది సిటీ ఆఫ్ డెస్టినీ. ఇది రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. సీఎం వచ్చి ఈ సిటీ నుంచి పరిపాలన ప్రారంభిస్తే.. ఈ నగరం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో వ్యాఖ్యానించారు.

Similar News

News January 10, 2026

చిరు మూవీ టికెట్ ధరలు పెంపు.. HCలో పిటిషన్

image

TG: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర‌వరప్రసాద్‌ గారు’ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్(అత్యవసర విచారణ) దాఖలైంది. దీనిపై సెలవుల తర్వాత విచారిస్తామని కోర్టు పేర్కొంది. ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతిస్తూ, రెగ్యులర్ షోల టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల <<18809035>>రాజాసాబ్<<>> టికెట్ల పెంపుపై HC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే MSVP బుకింగ్స్ మొదలయ్యాయి.

News January 10, 2026

నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

image

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.

News January 10, 2026

భారీ స్కోరు చేసిన గుజరాత్ జెయింట్స్

image

WPL-2026లో యూపీ వారియర్స్‌తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 207-4 స్కోరు చేసింది. కెప్టెన్ గార్డ్‌నర్(65) అర్ధసెంచరీతో అదరగొట్టగా అనుష్క(44), సోఫీ డివైన్(38) సహకారం అందించారు. చివర్లో జార్జియా మెరుపులు మెరిపించి 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27* రన్స్ చేయడంతో స్కోరు బోర్డు 200 దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు, శిఖా పాండే, డాటిన్ తలో వికెట్ తీశారు. UP టార్గెట్ 208.