News December 31, 2025
నాగర్కర్నూల్: ట్రాన్స్ జెండర్ పథకం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ పథకం 2025 ప్రారంభించడం జరిగిందని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఆర్థిక పునరవాసం కింద రెండు యూనిట్లు మంజూరయ్యాయని ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ జెండర్స్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Similar News
News January 17, 2026
మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!

TG: మేడారం మహాజాతర మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్య కార్యక్రమాల వివరాలు ఇలా..
* ఈ నెల 28(బుధవారం) సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చే సమయం
* 29(గురువారం) సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే సమయం
* 30(శుక్రవారం) అమ్మవార్లకు మొక్కులు చెల్లించుట
* 31(శనివారం) సాయంత్రం 4 గంటలకు సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం
** ఈ నెల 19న సీఎం రేవంత్ గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేస్తారు.
News January 17, 2026
MBNR: చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవు: కె.ప్రవీణ

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీ-ఫార్మసీ V &VII సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికాణి డాక్టర్ కే.ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ పాల్గొన్నారు.
News January 17, 2026
మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి: CM

దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని CM చంద్రబాబు తెలిపారు. ‘ఏపీకి ఉన్న అన్ని రకాల వనరులు ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల రూ.8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ మిషన్, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ముందున్న వారే విజేతలు అవుతారు. PM మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి’ అని కాకినాడలో సూచించారు.


