News December 31, 2025
మేడారం జాతరకు 12వేల మందితో బందోబస్తు: ఎస్పీ

మేడారం జాతరలో 12వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో 20 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తారని వెల్లడించారు. తొలిసారిగా డ్రోన్ కామాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 20 డ్రోన్లతో ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. 460 సీసీ కెమెరాలతో లైవ్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News January 2, 2026
రేవంత్రెడ్డిని రెండు సార్లు ఉరితీయాలి: కవిత

TG: MLC కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. KCRను ఉరితీయాలని రేవంత్ అనడం సరికాదని, ఉద్యమకారుడిని అలా అంటే రక్తం మరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు, రెండు సార్లు ఉరితీయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తిన కవిత, BRS మనుగడ కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. తన రాజీనామా ఆమోదం కోసం మండలికి వచ్చిన ఆమె ఈ విధంగా కామెంట్స్ చేశారు.
News January 2, 2026
నేషనల్స్కు నర్సీపట్నం సీనియర్ మహిళా బాక్సర్లు

నర్సీపట్నం బాక్సింగ్ అకాడమీకి చెందిన ఇద్దరు సీనియర్ ఉమెన్ బాక్సర్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు గ్రేటర్ నోయిడాలో జరిగే 9వ సీనియర్ మెన్, ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బొంతు మౌనిక(75 కేజీలు), యర్రా తేజస్విని (80+ కేజీలు) పాల్గొంటారు. ఇటీవల పిఠాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి అర్హత పొందారు.
News January 2, 2026
నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగు – నివారణ

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


