News April 24, 2024
విశాఖలో ముగిసిన సీఎం జగన్ యాత్ర

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి ఈరోజు విశాఖపట్నం జిల్లా ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. మొన్న విశాఖ జిల్లాలో ప్రవేశించిన బస్సు యాత్ర నిన్నటి విరామంతో ఎండాడ వద్ద ఆగిపోయింది. నేడు అక్కడి నుంచి ముఖ్యమంత్రి తన యాత్రను ప్రారంభించి విజయనగరం జిల్లాకు చేరుకున్నారు.
Similar News
News March 11, 2026
మార్చి 21నుంచి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర

పెద వాల్తేరులో వేంచేసిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మార్చ్ 21నుంచి ఏప్రిల్ 21వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పలు విభాగాల అధికారులతో మహారాణి పేట డిప్యూటీ తహశీల్దార్ సనపల చైతన్య ఆధ్వర్యంలో అలయ ఈఓ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులకు భీమిలీ RDO పలు సూచనలు చేశారు. క్యూ లైన్ నిర్వహణ, శానిటేషన్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాల పలు సూచనలు చేశారు.
News March 10, 2026
జీవీఎంసీ ప్రస్థానం: తొలి మేయర్ నుండి నేటి పాలన వరకు!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి చెందిన పులుసు జనార్దనరావు తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ముగిశాక, దాదాపు పదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే జీవీఎంసీ కొనసాగింది. సుదీర్ఘ విరామం తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించడంతో నగరపాలక సంస్థకు ప్రజాప్రతినిధుల పాలన తిరిగి ప్రారంభమైంది
News March 10, 2026
విశాఖ రుషికొండలో ‘క్రౌన్ ప్లాజా’ హోటల్

విశాఖపట్నం రుషికొండలో ‘కోస్టల్ హాస్పిటాలిటీ ప్రిసింక్ట్’ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ‘క్రౌన్ ప్లాజా’ బ్రాండ్తో కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది. సుమారు ₹280.51 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా 310 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పర్యాటక పాలసీ 2024-29లో భాగంగా ప్రభుత్వం భూమిని, ప్రోత్సాహకాలను కేటాయించింది.


