News April 24, 2024

భారత్‌లో 14ఏళ్ల గరిష్ఠానికి వ్యాపార కార్యకలాపాలు!

image

భారత్‌లో వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈనెలలో వ్యాపార కార్యకలాపాలు 14ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. మార్చి నెలలో 61.8గా ఉన్న వ్యాపార కార్యకలాపాల సూచీ ఈనెలలో 62.2కు చేరినట్లు HSBC పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) వెల్లడించింది. మానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లు రాణించడమే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. 800 సంస్థలపై సర్వే చేపట్టి ఈ విషయాలు వెల్లడించింది.

Similar News

News March 14, 2026

ట్రంప్.. వాటిని బూడిద చేస్తాం: IRGC

image

ఖర్గ్ ద్వీపంలోని (ఇరాన్) ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి చేస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ <<19377504>>హెచ్చరికపై<<>> IRGC దీటుగా స్పందించింది. ‘ఉగ్రవాది ట్రంప్ ఇరాన్ ఆయిల్, ఎనర్జీ, ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి చేస్తామని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలా చేస్తే అమెరికా భాగస్వామ్యం ఉన్న అన్ని ఆయిల్, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లపై అటాక్ చేస్తామని ఇదివరకే హెచ్చరించాం. వాటిని బూడిద చేసేస్తాం’ అని హెచ్చరించింది.

News March 14, 2026

చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

image

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.

News March 14, 2026

తిరుమలలో నిత్యం కల్యాణమే..

image

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.