News January 1, 2026
ఆదిలాబాద్: యువకుడి సూసైడ్

తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలం హస్నాపూర్కి చెందిన రాథోడ్ సాయికిరణ్(27) డయాలసిస్ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజులుగా మద్యం తాగి వస్తుండటంతో ఈనెల 30న తండ్రి బాపురావు మందలించారు. మనస్తాపం చెంది పురుగు మందు తాగగా కుటుంబీకులు రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Similar News
News January 3, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణలో వేగం పెంచాలి: కలెక్టర్

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ప్రతిరోజూ కనీసం 40 ఎంట్రీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News January 3, 2026
‘ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి’

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రవాణా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్ స్పాట్స్) ప్రదేశాలను గుర్తించాలన్నారు. అక్కడ వెంటనే హెచ్చరిక బోర్డులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 3, 2026
హైకోర్టులో కేసు వేసిన వేదిక్ యూనివర్సిటీ VC

TTD శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ రాణి సదాశివమూర్తి హైకోర్టులో ‘WRIT PETITION’ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, TTD, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ను అందులో ప్రతివాదులుగా చేర్చారు. VC పదవికి ఆయన అనర్హుడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. TTD బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.


