News January 1, 2026
అద్దంకి: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు దోచేశారు

CBI నుంచి ఫోన్ చేస్తున్నాం.. మనీ లాండరింగ్ కేసులో మీపై సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది చెప్పి సైబర్ నేరగాళ్లు అద్దంకి వాసి వద్ద డబ్బులు కాజేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెయిల్ మంజూరు కావాలంటే డబ్బులు చెల్లించాలని అద్దంకికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు నుంచి 3 వారాల క్రితం రూ.1.23 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News January 7, 2026
ఢిల్లీ పొల్యూషన్.. రెండో రాజధానే సొల్యూషనా?

పొల్యూషన్కు పర్యాయపదంగా ఢిల్లీ మారిపోయింది. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశ పరిపాలనా వ్యవహారాలకూ ఇబ్బంది కలుగుతోంది. హరియాణా, పంజాబ్లలో పంట వ్యర్థాల కాల్చివేతలతోపాటు లెక్కకుమించిన వాహనాలూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు వాదన బలపడుతోంది. దీనివల్ల ఢిల్లీపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మరి ఏ నగరం రెండో రాజధానికి అనుకూలం? కామెంట్
News January 7, 2026
విశాఖ: పండుగ స్పెషల్ ట్రైన్ వివరాలివే!

విశాఖ పండుగ వేళ ప్రయాణికుల కోసం విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు 08513 విశాఖ-చర్లపల్లి ఈ నెల 18న రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:30కి చేరుతుంది.08514 చర్లపల్లి-విశాఖఈ నెల 19న మధ్యాహ్నం 3:30కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది.ఈ రైళ్లు దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ తదితర స్టేషన్లలో ఆగుతాయి.
News January 7, 2026
స్వర్ణ నారావారి పల్లెలో సీఎం ప్రారంభించనున్న కార్యక్రమాలు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని CM చంద్రబాబు స్వర్ణ నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, స్కిల్ డెవలప్మెంట్ భవనం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (50 బెడ్స్) ఈ సంజీవిని ప్రాజెక్టు, టాటా DINC, శేషాచల లింగేశ్వర స్వామి ఆలయానికి CC రోడ్డు, 33/11 KV ఇండోర్ సబ్ స్టేషన్ ప్రారంభిస్తారు. మహిళలకు ఈ ఆటోల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.


