News January 1, 2026
మహబూబాబాద్లో పులి.. నిఘా పెంపు.!

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పులి అలజడి మొదలైంది. గంగారం, కొత్తగూడ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించాయి. రాంపూర్, ఓటాయి, కర్ణగండి గ్రామస్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. అయితే, పులులు తోడు కోసం ఈ సమయంలో అటవీ ప్రాంతాలకు రావడం సహజమేనని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవి వైపు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Similar News
News January 12, 2026
ఖమ్మం: రిజిస్ట్రేషన్ల శాఖకు ‘కాసుల పంట’

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 206.25 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఏడాది (2025-26) డిసెంబరు నాటికే రూ. 141.84 కోట్లు లభించాయి. మరో మూడు నెలల సమయం ఉండటంతో ఈసారి ఆదాయం రికార్డు స్థాయికి చేరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News January 12, 2026
APPLY NOW: హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

వైజాగ్లోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (<
News January 12, 2026
ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే?

మేష రాశి -రామేశ్వరం, వృషభ రాశి -సోమనాథ్,
మిథున రాశి -నాగేశ్వరం, కర్కాటక రాశి -ఓంకారేశ్వరం,
సింహ రాశి -వైద్యనాథ్, కన్య రాశి -శ్రీశైలం,
తులా రాశి -మహాకాళేశ్వరం, వృశ్చిక రాశి -ఘృష్ణేశ్వరం,
ధనుస్సు రాశి -కాశీ, మకర రాశి -భీమశంకర్,
కుంభ రాశి -కేదార్నాథ్, మీన రాశి -త్రయంబకేశ్వర్,
ఇలా రాశుల ప్రకారం క్షేత్రాలను సందర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగి, శివానుగ్రహంతో సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం.


