News April 24, 2024
శశిథరూర్ ఒక ఆశను కల్పించారు: ప్రకాశ్ రాజ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి మళ్లీ గెలుస్తారని నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ‘థరూర్ ఈ నియోజకవర్గానికి చాలా చేశారు. మళ్లీ ఆయనే గెలుస్తారు. ఆయన నాకు మిత్రుడని నేను మద్దతు ఇవ్వడం లేదు. గడచిన దశాబ్ద కాలంగా ఈ దేశ ప్రతినిధిగా థరూర్ నమ్మకాన్ని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. తిరువనంతపురంలో థరూర్ 2009 నుంచి గెలుస్తుండటం గమనార్హం.
Similar News
News March 3, 2026
అడల్ట్ కంటెంట్ను INDలో బ్లాక్ చేసిన X

దేశంలో అశ్లీల కంటెంట్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా X కీలక నిర్ణయం తీసుకుంది. పరస్పర అంగీకారంతో ఇండియాలో అడల్ట్/పోర్న్ వీడియోలను నేటి నుంచి బ్లాక్ చేయనుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈ కంటెంట్ యథావిధిగా అందుబాటులో ఉండనుంది. స్థానిక చట్టాలకు లోబడి ప్లాట్ఫామ్ను సురక్షితంగా ఉంచడమే దీని ఉద్దేశం. భారత్లో ఇకపై ఎటువంటి సెన్సిటివ్ & అడల్ట్ కంటెంట్ Xలో కనిపించదు.
News March 3, 2026
IIT బెనారస్లో ఉద్యోగాలు

<
News March 3, 2026
ఇరాన్లో భూకంపం.. అణుకేంద్రాల దగ్గర అలజడి

ఇరాన్లోని గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10km లోతులో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలు సహజసిద్ధమైనవేనని USGS తెలిపింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ భూకంపం రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. గెరాష్కు సమీపంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, గ్చైన్ యురేనియం గనులకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. యుద్ధం మధ్యలో ఈ భూకంపం భయాందోళనలను రేకెత్తించింది.


