News January 1, 2026
ఎర్రవల్లి ఫామ్ హౌస్, నందినగర్ నివాసానికి లేఖలు

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బాధితులు మాజీ సీఎం కేసీఆర్కు లేఖలు పంపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్, నందినగర్ నివాసాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా వీటిని పంపారు. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ భూమి, నివాస, పునరావాస సమస్యలపై చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ గోడును సభ దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు కోరారు.
Similar News
News January 11, 2026
సిరిసిల్ల: 183 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత

శాత్రాజుపల్లి వద్ద ప్రధాన పైప్ లైన్ లీకేజీ కారణంగా 183 గ్రామాలకు తాగునీటికి అంతరాయం ఏర్పడినట్లు వేములవాడ సబ్ డివిజన్ మిషన్ భగీరథ DEE సిహెచ్ విశ్వన్ తెలిపారు. వేములవాడ (2), వేములవాడ రూరల్ (20), బోయినపల్లి (30), గంగాధర (45), కొడిమ్యాల (32), మల్యాల (29), చొప్పదండి (25) గ్రామాలకు ఈనెల 13వ తేదీ వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.
News January 11, 2026
లేట్ కాకముందే డీల్ చేసుకోండి.. క్యూబాకు ట్రంప్ హెచ్చరిక

క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ‘ఇకపై క్యూబాకు ఆయిల్ లేదా డబ్బు వెళ్లదు. ఆలస్యం కాకముందే డీల్ చేసుకోవాలని సూచిస్తున్నా. వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్, డబ్బుతో చాలా ఏళ్లు క్యూబా బతికింది. అందుకు బదులుగా వెనిజులాకు సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. ఇకపై అలా జరగబోదు’ అని ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు.
News January 11, 2026
గండికోట ఉత్సవాల్లో పర్యాటక మంత్రి.. ఏం మాట్లాడారంటే.!

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం గండికోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. గండికోట ఓ వారసత్వ సంపదని మోదీ, CM, DyCm ఇలాంటి కట్టడాల పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఈ ప్రాంతంలో హోటల్స్ వెలుస్తాయన్నారు. ఈ ప్రాంత వసతి, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గండికోట ఉత్సవ ఏర్పాట్లు చేసిన కలెక్టర్, SP ఇతర జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.


