News January 1, 2026

తణుకు: దంపతులను ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి

image

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్‌పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 10, 2026

ప.గో: కోట్లల్లో పందేలు.. ఎందుకంటే!

image

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

News January 10, 2026

మొగల్తూరు: కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోండి

image

పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరి చూసుకుని కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. శనివారం మొగల్తూరు మండలం శేరేపాలెం రెవెన్యూ విలేజ్ కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులను కలిసి జేసీ మాట్లాడారు. పాసు పుస్తకాలలో ఉన్న ఫొటో, పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం, ఆధార్ నంబరు, వంటివి ఏమైనా తప్పిదాలు ఉంటే పరిశీలించుకుని సరి చేయించుకోవాలన్నారు.

News January 10, 2026

పాలకొల్లు ఆసుపత్రికి మహర్దశ

image

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆయుర్వేద ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రూ.12.50 కోట్లతో ఆసుపత్రిని 100 బెడ్లుగా అభివృద్ధి చేశామని, రూ.కోటితో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యూటిఫికేషన్ కోసం మరో రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.