News January 1, 2026
రో-కో లేకపోతే వన్డేలు కష్టమే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం వన్డే క్రికెట్ పరిస్థితిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు రిటైరైతే ఈ ఫార్మాట్ను చూసేవారు తగ్గిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. T20లకు హవా పెరగడం, టెస్ట్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ODIలకు ఆదరణ తగ్గుతుందని అంచనా వేశారు.
Similar News
News January 14, 2026
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై విజయం

WPL-2026లో గుజరాత్తో జరిగిన మ్యాచులో ముంబై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(71*) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. <<18849934>>193<<>> పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కమలిని(13), మాథ్యూస్(22) విఫలమయ్యారు. ఆ తర్వాత అమన్జోత్(40)తో కలిసి హర్మన్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత వచ్చిన కేరీ(38*) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్కు ఇది తొలి ఓటమి.
News January 14, 2026
అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.
News January 14, 2026
WPLలోనే తొలి ప్లేయర్

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన తొలి ప్లేయర్గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.


