News January 1, 2026
సింహాచలం ప్రసాదంలో నత్త ఘటన.. విచారణ ముమ్మరం

సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త కనిపించిందన్న ఘటనపై దేవాదాయ శాఖ విచారణ ముమ్మరం చేసింది. ఈవో సుజాత, ఏఈఓ రమణమూర్తిలను సీపీ విచారించి, నివేదికతో పాటు సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించారు. ప్రసాదం తయారీలో నత్త పడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తూ, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియో ప్రచారం చేసిన జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 30 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఏఈఓ రమణమూర్తి పేర్కొన్నారు.
Similar News
News January 5, 2026
అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
News January 5, 2026
పాలమూరు: మున్సిపల్ ఎన్నికల వేళ.. నేతల ఆశలు

కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కసరత్తు ముమ్మరం కావడంతో ఆశావహులు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నాయకులు సంక్రాంతి తర్వాత చూద్దామని చెబుతుండగా, ఆశావహులు మాత్రం డివిజన్లలో రహస్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
News January 5, 2026
ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.


