News January 1, 2026
సింహాచలం ప్రసాదంలో నత్త ఘటన.. విచారణ ముమ్మరం

సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త కనిపించిందన్న ఘటనపై దేవాదాయ శాఖ విచారణ ముమ్మరం చేసింది. ఈవో సుజాత, ఏఈఓ రమణమూర్తిలను సీపీ విచారించి, నివేదికతో పాటు సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించారు. ప్రసాదం తయారీలో నత్త పడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తూ, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియో ప్రచారం చేసిన జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 30 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఏఈఓ రమణమూర్తి పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి: కేటీఆర్

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం హైదరాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు వారికి దిశా నిర్దేశం చేశారు. జిల్లా అద్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ మాజీ ఛైర్మన్లు పాల్గొన్నారు.
News January 11, 2026
హన్మకొండ: రైలుకు ఎదురుగా వెళ్లి సూసైడ్

హసన్ పర్తి మండలం చింతగట్టు రైల్వే గేట్ వద్ద విషాద ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ను పక్కన పెట్టి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పల్సర్ 150(నంబర్ AP36 AM 8417)పై అతను వచ్చినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 11, 2026
సిరిసిల్ల: 183 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత

శాత్రాజుపల్లి వద్ద ప్రధాన పైప్ లైన్ లీకేజీ కారణంగా 183 గ్రామాలకు తాగునీటికి అంతరాయం ఏర్పడినట్లు వేములవాడ సబ్ డివిజన్ మిషన్ భగీరథ DEE సిహెచ్ విశ్వన్ తెలిపారు. వేములవాడ (2), వేములవాడ రూరల్ (20), బోయినపల్లి (30), గంగాధర (45), కొడిమ్యాల (32), మల్యాల (29), చొప్పదండి (25) గ్రామాలకు ఈనెల 13వ తేదీ వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.


