News April 24, 2024

రేపు ఉ.10 గంటలకు శ్రీవారి టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే జులై నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లను కూడా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. అటు వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి.

Similar News

News January 11, 2026

కాంగ్రెస్‌తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

image

ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్‌ను స్టాలిన్ తిరస్కరించినట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఉండబోదన్న DMK నేత, మంత్రి పెరియస్వామి మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు హీరో విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

News January 11, 2026

మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

image

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.

News January 11, 2026

ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

image

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.