News January 2, 2026
నల్గొండ: మున్సిపాలిటీల్లో పెరిగిన 31,902 మంది ఓటర్లు

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో (నకిరేకల్ మినహా) 18 మున్సిపాలిటీల్లో 6,33,683 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితా ప్రకారం ఆ సంఖ్య 6,65,585కు చేరింది. నాలుగేళ్లలో కొత్తగా 31,902 మంది ఓటర్లు పెరిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల జాబితా ఆధారంగా ఈ ముసాయిదాను సిద్ధం చేశారు. విశేషమేమిటంటే, ఓటర్ల నమోదులో పురుషుల కంటే మహిళలే ఆధిక్యంలో ఉండటం.
Similar News
News January 21, 2026
గ్రామపంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్ వరకు..

జనగామ గ్రామ పంచాయతీ 11 వార్డులతో సర్పంచిగా గీట్ల జనార్థన్ రెడ్డి నుంచి రామగుండం 60 డివిజన్ల కార్పొరేషన్ వరకు విస్తరించింది. 1982లో రామగుండం నోటిఫైడ్ ఏరియా, 1957- 2009 వరకు RGM ప్రాంతం మేడారం నియోజకవర్గంలో ఉండేది. 1995లో మున్సిపాలిటీగా, 2003లో కార్పొరేషన్గా హోదా పెరిగింది. కార్పొరేషన్కు ఈసారి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 93.87 చ.కి. వైశాల్యంలో విస్తరించి ఉంది.
News January 21, 2026
NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.
News January 21, 2026
రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ <


