News January 2, 2026
ఆసిఫాబాద్: ఎస్పీ సీరియస్ అలర్ట్.!

ఆసిఫాబాద్ జిల్లాను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచుపై పోలీస్ శాఖ స్పందించింది. రోడ్లపై మరణ మృదంగం మోగకుండా ఉండేందుకు ఎస్పీ నితిక పంత్ వాహనదారులను హెచ్చరించారు. వేగం తగ్గించడమే కాదు, తప్పక లైట్లు ఆన్ చేయాలన్నారు. “కనిపించని దారి – మితిమీరిన వేగం” ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. భారీ వాహనదారులు రోడ్డు పక్కన ఆపేటప్పుడు ఇండికేటర్లు వాడాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు చెప్పారు.
Similar News
News February 18, 2026
గుంటూరు DMHO వేటుకు కారణం అదేనా..?

గుంటూరు DMHO బదిలీ అయిన విషయం తెలిసిందే. తురకపాలెంలో ప్రబలిన జ్వరాలను గుర్తించి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు మృత్యువు భారిన పడుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతంలో నేరుగా ఆరోగ్య శాఖ డైరెక్టర్కు ప్రత్తిపాడు MLA రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఔట్సోర్సింగ్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులున్నాయి.
News February 18, 2026
మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!

ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ తొలి బ్యాటరీ రెంటల్ వాహనం ‘ఈ-విటారా’ SUVని గ్రాండ్గా లాంచ్ చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ దూసుకెళ్లనుంది. బ్యాటరీ యూజ్ ఎ సర్వీస్ ఓనర్షిప్ కింద ప్రారంభ ధర రూ.10.99లక్షలుగా ఉంది. మొదలవుతుంది. బ్యాటరీ యూసేజ్ రెంట్ ఛార్జీ కి.మీకు రూ.3.99 చొప్పున చెల్లించాలి. ఈవీ లాంచ్తో నిన్న మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
News February 18, 2026
ఖమ్మం: రైతులకు ‘యాప్’ సోపాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్ నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుకు 72వేల మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 22వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా.. రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 78వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. పట్టాదారు పాసుపుస్తకాలు లేని దేవదాయ, కాందిశీకుల భూముల సాగుదారులకు యూరియా అందడం లేదు. సెల్ ఫోన్ లేని రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.


