News April 24, 2024

చంద్రబాబు, జగన్ ప్రజల చేతిలో చిప్ప పెట్టారు: షర్మిల

image

టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు కిటికీలు తెరిచి దోపిడీ చేస్తే వైసీపీ హయాంలో ఏకంగా తలుపులే తెరిచారని వైఎస్ షర్మిల అన్నారు. కర్లపాలెంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా చెప్పుకోవడానికి రాజధాని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ కలిసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల చేతిలో చిప్ప పెట్టారన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసలుగా తయారయ్యారన్నారు.

Similar News

News January 14, 2026

‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.

News January 14, 2026

బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

image

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.

News January 14, 2026

గుంటూరు: DLSAలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధ(DLSA)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DLSA కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు
https://Guntur.dcourts.gov.inని సందర్శించాలని సూచించారు.