News January 2, 2026

వనపర్తి జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

image

వనపర్తి జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జోగులాంబ గద్వాల జోన్‌-7 డీఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాల్‌పేట ఎస్సైగా జగన్మోహన్‌, వనపర్తి రూరల్‌కు హృషీకేశ్‌, పెద్దమందడికి జలంధర్‌రెడ్డి బదిలీ అయ్యారు. నరేష్‌ కుమార్‌, శివకుమార్‌లను ఎస్పీ కార్యాలయానికి వీఆర్‌గా పంపారు. బదిలీ అయిన అధికారులు త్వరలోనే తమ బాధ్యతలు స్వీకరించనున్నట్లు జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Similar News

News January 12, 2026

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని దిశానిర్దేశం చేశారు.

News January 12, 2026

మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 12, 2026

కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

image

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.