News January 2, 2026

భద్రాద్రి: హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతం.. లేఖ కలకలం

image

మావోయిస్టు అగ్రనేత మడివి హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతంపై మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. భద్రాచలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుట్ర వల్లే హిడ్మా పట్టుబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మాను ఆసుపత్రికి తరలిస్తానని నమ్మించి, పోలీసులకు సమాచారం ఇచ్చి రివార్డు సొమ్ము కోసం కుట్ర పన్నారని ఆరోపించారు.

Similar News

News January 14, 2026

డెయిరీఫామ్.. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

image

గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 14, 2026

UPDATE: ఖమ్మం LIG ఫ్లాట్ల రహదారి సమస్య పరిష్కారం

image

ఖమ్మం శ్రీరాం నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIG ఫ్లాట్లలో రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైనట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి వెల్లడించారు. కాగా రహదారి విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా, అనేక మంది దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కావడంతో LIG ఫ్లాట్స్‌కు JAN 18 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 19న లాటరీ ద్వారా ప్లాట్స్ కేటాయిస్తామని పేర్కొన్నారు.

News January 14, 2026

మిర్యాలగూడ జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి!

image

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సీఎం ప్రకటనతో ఉమ్మడి నల్గొండలో చర్చ మొదలైంది. ప్రధానంగా మిర్యాలగూడను జిల్లాగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో లోక్‌సభ స్థానంగా ఉన్న ఈ ప్రాంతం.. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. సాగర్, హుజూర్‌నగర్, దేవరకొండ ప్రాంతాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యంతో పాటు ఉపాధి పెరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.