News April 24, 2024
రాష్ట్రంలో రూ.155 కోట్లు స్వాధీనం

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో రూ.61.77 కోట్ల నగదు, రూ.19.16 కోట్లు విలువ చేసే నగలు, రూ.28.92 కోట్ల విలువైన మద్యంతో పాటు రూ.23.87 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన ఇతర వస్తువులను ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
సన్స్క్రీన్ ఎలా వాడాలంటే?

కాలంతో సంబంధం లేకుండా సన్స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్స్క్రీన్ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్స్క్రీన్లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.
News October 25, 2025
వచ్చే నెల నుంచి అందుబాటులోకి ‘భారత్ టాక్సీ’

ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా కేంద్రం ‘భారత్ టాక్సీ’ని తీసుకురానుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి 25% చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఢిల్లీలో విజయవంతమైతే డిసెంబర్లో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
News October 25, 2025
నాగుల చవితి: పాములను ఎందుకు పూజిస్తారు?

దైవ స్వరూపంలో ప్రకృతి కూడా భాగమేనని మన ధర్మం బోధిస్తుంది. అందుకే ప్రకృతిలో భాగమైన పాములను కూడా మనం పూజిస్తాం. పురాణాల్లోనూ పాములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విష్ణుమూర్తి ఆదిశేషువుపై పవళించడం, శివుడు పాముని మెడలో ధరించడం, సముద్ర మథనంలో వాసుకిని కవ్వంగా ఉపయోగించడం వంటి కథలు వాటి దైవత్వాన్ని చాటి చెబుతాయి. నాగ దేవతలను ఆరాధించడం అంటే ప్రకృతి ధర్మాన్ని, జీవరాశిని గౌరవించడమే. అందుకే మనం పాములను పూజిస్తాం.


