News January 2, 2026

సూర్యాపేట జిల్లాలో 17 మందికి కుష్టు వ్యాధి గుర్తింపు

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 17 మందికి కుష్టు వ్యాధి సోకినట్లు గుర్తించామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ తెలిపారు. డిసెంబరు 18 నుంచి 31 వరకు ఆశా కార్యకర్తలు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి 1,042 మంది అనుమానితులను గుర్తించగా, పరీక్షల అనంతరం 17 మందికి నిర్ధారణ అయ్యిందన్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స ప్రారంభించామని, లక్షణాలుంటే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.

Similar News

News January 9, 2026

ధనుర్మాసం: ఇరవై ఐదో రోజు కీర్తన

image

కృష్ణుడి అనుగ్రహం కోసం గోపికలు నిద్రిస్తున్న గోపికను నిద్రలేపే సన్నివేశం ఇది. బయట ఉన్నవారు ఆమెను ‘చిలుక’ అని పిలుస్తూ త్వరగా రమ్మనగా ఆమె చమత్కారంగా బదులిస్తుంది. చివరకు కంసుని గజమైన కువలయాపీడాన్ని, శత్రువులను సంహరించిన ఆ కృష్ణుని గుణగానం చేస్తేనే వ్రతం ఫలిస్తుందని, అందరం కలిసి భగవంతుడిని కీర్తిద్దామని వారు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇలా అందరూ కలిసి భక్తితో కృష్ణుని వైపు పయనిస్తారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 9, 2026

మడకశిరలో చెడ్డీ గ్యాంగ్ సంచారం.. పోలీసుల హెచ్చరిక

image

మడకశిర పట్టణ శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య ప్రజలను హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ఎవరైనా తలుపులు తట్టినా, కాలింగ్ బెల్ కొట్టినా లేదా ప్రమాదం అని అరిచినా.. వెంటనే తలుపులు తీయొద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.

News January 9, 2026

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

image

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.