News January 2, 2026
ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.
Similar News
News January 26, 2026
మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.
News January 26, 2026
నకిరేకల్: ఎదురెదురుగా ఢీకొన్న బైక్లు.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

నకిరేకల్ బైపాస్లోని సాయిప్రియ హోటల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల బందోబస్తు ముగించుకొని బైక్పై వస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను, రాంగ్ రూట్లో బైక్పై వస్తున్న ఇద్దరు బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.
News January 26, 2026
నల్గొండ: నోటిఫికేషన్ ముంగిట అభ్యర్థుల వేట

రెండు మూడు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. రిజర్వేషన్ల మార్పులు, ఒక్కో వార్డులో పలువురు ఆశావహులు ఉండటంతో ఎంపిక కష్టంగా మారింది. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేశారు.


