News April 24, 2024

తెలంగాణ పరువు తీశారు: కేసీఆర్

image

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అధికారులను మార్చిందని దుయ్యబట్టారు.

Similar News

News November 2, 2025

తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా.. 31,612 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News November 2, 2025

పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

image

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

News November 2, 2025

ప్రెగ్నెన్సీ నిలవాలంటే..

image

కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్‌ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక గర్భస్రావం అవుతుంది. దీన్ని సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ అంటారు. అలా అయితే ట్రాన్స్‌వెజైనల్‌ సర్‌క్లేజ్‌ అంటే వెజైనాలోంచి సెర్విక్స్‌ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు. కొన్నిసార్లు ట్రాన్స్‌అబ్డామినల్‌ అప్రోచ్‌ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా 3వ నెలలో పొట్టను ఓపెన్‌ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.