News April 25, 2024

జగన్‌పై రాళ్ల దాడి: పోలీసు అధికారులపై వేటు

image

AP: సీఎం జగన్‌పై రాళ్ల దాడి నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీ కాంతిరానా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

Similar News

News January 11, 2026

పాకిస్థాన్‌కు యుద్ధం చేసే ధైర్యం లేదు: మనోజ్ కటియార్

image

ఇండియాతో నేరుగా యుద్ధం చేసే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని వెస్టర్న్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే పాక్ ఏకైక ఆయుధమని, పరోక్ష యుద్ధంతోనే భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశం ఉందని హెచ్చరించారు. భారత సైన్యం బలం భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు.

News January 11, 2026

నితీశ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్‌లు ఈ మేరకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రెండు దశాబ్దాలుగా బిహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన కృషి ఆయనను భారతరత్నకు అర్హుడిని చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో జేడీయూ నేత కేసీ త్యాగి సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

News January 11, 2026

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ అలర్ట్‌

image

ఈ-కామర్స్ సంస్థలు మరో భారీ సేల్స్‌కు రెడీ అయ్యాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. ఫోన్లు, TVలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లను ఇస్తున్నాయి.