News January 3, 2026

మంచిర్యాల: ఆ మున్సిపాలిటీకి ఎన్నికలెప్పుడు..?

image

మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడి 3 దశాబ్దాలవుతున్నా నేటికీ ఎన్నికలు జరగకపోవడం గమనార్హం. 1995లో మున్సిపాలిటీ ఏర్పడినా రిజర్వేషన్ల వివాదంతో 1998లో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు ఆగిపోయాయి. అప్పటి నుంచి త్రిసభ్య కమిటీ పాలనలోనే కాలం వెళ్లదీస్తోంది. ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వాలు హామీలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి.

Similar News

News February 20, 2026

తూ.గో: ‘క్వింటా శనగలు రూ.5,875కే కొనుగోలు’

image

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా రూ.5,875 చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.

News February 20, 2026

పరీక్షల నిర్వహణలో CS, DOలదే ముఖ్య పాత్ర: DIEO

image

పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారు(DO)లదే ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్
విద్యా అధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుందన్నారు.

News February 20, 2026

పాపం.. దేవుడిని వదిలేయండి!

image

తిరుమల లడ్డూ విషయంలో పార్టీల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కొవ్వు, జంతుకొవ్వు, జస్ట్ కెమికల్ కల్తీ అంటూ రకరకాల వెర్షన్లు, రీ-వెర్షన్లతో ప్రత్యర్థులకు మరక పూసి లాభం పొందాలనే పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో స్వార్థానికై ప్రసాద పవిత్రత తగ్గిస్తున్నారని జనాలు చీదరించుకుంటున్నారు. లడ్డూను చూస్తే భక్తులకు ఆధ్యాత్మిక భావన, మదిలో ఆ దేవుడి రూపం కన్పించాలి తప్ప ఆందోళన కలగకూడదు. ఇకనైనా ఆపండి.