News January 3, 2026

రోహిత్, కోహ్లీలను సెలక్ట్ చేస్తే..

image

జనవరి 11, 14, 18 తేదీల్లో న్యూజిలాండ్‌తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం నేడు బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసులతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన సీనియర్లు రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. వారిని సెలక్ట్ చేస్తే 2027 వన్డే WC జట్టులో ఉంటారని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపినట్లు అవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News February 14, 2026

కరీంనగర్ కాషాయానిదే.. మ్యాజిక్ ఫిగర్ దాటిన BJP

image

TG: కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇద్దరు రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు తాజాగా కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక్కడ మొత్తం 66 డివిజన్లు ఉండగా ఫలితాల్లో బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది. నిన్న ఒక స్వతంత్ర, ఒక AIFB అభ్యర్థి ఆ పార్టీలో చేరారు. ఇవాళ మరో ఇద్దరి చేరిక, ఎంపీ బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 35కు చేరింది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.

News February 14, 2026

పాక్‌తో అభిషేక్ ఆడతారా? సూర్య లేటెస్ట్ స్టేట్‌మెంట్ ఇదే

image

T20 WCలో రేపు జరగబోయే IND-PAK మ్యాచులో అభిషేక్ శర్మ ఆడటంపై కెప్టెన్ సూర్యకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్‌మీట్లో మాట్లాడారు. తాము టఫ్ టీమ్‌తో ఆడతామని, అభిషేక్ తిరిగి IND జట్టులోకి రావాలని కోరుకుంటున్నామని PAK కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. దీనిపై స్పందించిన సూర్య ‘నిజంగా సల్మాన్ అదే కోరుకుంటే తప్పకుండా అభిషేక్‌ను ఆడిస్తాం’ అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అభి ఆడటం ఖాయమైంది.

News February 14, 2026

మున్సిపల్ ఫలితాలపై సీఎం కీలక సమావేశం

image

TG: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎల్లుండి మేయర్, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.