News April 25, 2024

ఏపీ సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి: కోటంరెడ్డి

image

AP: సీఎస్ జవహర్‌రెడ్డిపై EC చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల విధులు చూడాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ <<13110732>>సీతారామాంజనేయులు <<>>గతంలో నాకు ఫోన్ చేసి పరోక్షంగా బెదిరించారు. పెన్షన్లపై ఈసీ ఆదేశాలను సీఎస్ సరిగా అమలు చేయలేదు. జవహర్ రెడ్డిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వైసీపీని వీడాక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు’ అని ఆరోపించారు.

Similar News

News November 7, 2025

SBI అరుదైన ఘనత

image

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.

News November 7, 2025

చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

image

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

News November 7, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు

image

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.