News January 3, 2026

సంగారెడ్డి: గ్రామాని కో సమైక్య సంఘం భవన నిర్మాణం

image

గ్రామస్థాయిలో మహిళా సాధికారతకు ప్రభుత్వం తాజాగా సమైక్య సంఘం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. NREGS కింద ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 613 జీపీల్లో 1.94 లక్షల మంది సభ్యులతో 18.848 మహిళా సంఘాలు, 613 గ్రామైక్య సంఘాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో భవన నిర్మాణానికి 200 చదరపు గజాల్లో స్లాబ్‌తో వర్క్ షెడ్ నిర్మించనున్నారు.

Similar News

News January 14, 2026

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారు: కేతిరెడ్డి

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. తమ సిద్ధాంతం ఒంటరి పోరాటమని, ఒంటరిగానే గెలుస్తామని స్పష్టం చేశారు. ధర్మవరం మున్సిపాలిటీలో సున్నపు పొడి కనిపిస్తే సత్యకుమార్ వస్తున్నారని అర్థమన్నారు. ఆయనను సత్యకుమార్ అనడం కంటే పీపీపీ మంత్రి అనడమే కరెక్ట్ అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

News January 14, 2026

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

image

AP: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.

News January 14, 2026

అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య 6 లైన్ల రోడ్డుకి DPR జాప్యం

image

విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో కీలకమైన గోదావరి జిల్లాలను విశాఖతో అనుసంధానించే జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు DPR (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) దశలోనే జాప్యం జరుగుతోంది. రాజమహేంద్రవరం-అనకాపల్లి మధ్య 161 KM మేర ఉన్న 4 లైన్ల రహదారిని 6 లైన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. DPR ఖరారు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టుకు సుమారు రూ.9,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా.