News January 3, 2026
నియమాలు పాటిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట : సిరిసిల్ల DTO

రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) లక్ష్మణ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు, వాహనదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.
Similar News
News February 21, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 21, 2026
మునుగోడు: యజమాని మృతి.. శ్మశానం వద్దే వేచిచూస్తున్న కుక్క!

మునుగోడు మండలం కిష్టాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకంటే మూగజీవాల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది. తనను ప్రాణప్రదంగా చూసుకున్న యజమాని పార్వతమ్మ మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసినా, మండుటెండలో శ్మశానం వద్దే ఉండిపోవడం ఆ మూగజీవికి ఉన్న అనురాగానికి నిదర్శనం. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
News February 21, 2026
ALERT: మూడ్రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ఉన్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


