News January 3, 2026

సభకు రాని వ్యక్తి అజెండా డిసైడ్ చేస్తున్నారు: అక్బరుద్దీన్

image

TG: సభకు రాని వ్యక్తి సభ అజెండా డిసైడ్ చేస్తున్నారంటూ KCRను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో MIM MLA అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆయన ఇరిగేషన్‌పై చర్చిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు BRS ఎమ్మెల్యేలెవరూ సభలో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఇక 2,3 రోజుల నుంచి అసెంబ్లీలో కృష్ణా, గోదావరి తప్ప వేరే అంశాలపై చర్చించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇతర సమస్యలపైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 24, 2026

మార్కెట్లు క్రాష్.. ₹3లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1068 పాయింట్లు కోల్పోయి 82,225కు చేరగా నిఫ్టీ 288 పాయింట్లు క్రాష్ అయ్యి 25,424 వద్ద సెటిల్ అయింది. రూపాయి పతనం, భారీగా ఐటీ స్టాక్స్ విక్రయం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత, క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం పతనానికి కారణమయ్యాయి. ₹3లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30లో టెక్ మహీంద్రా అత్యధికంగా 6.60% నష్టపోయింది.

News February 24, 2026

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. హాల్‌టికెట్ తీసుకున్నారా?

image

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలవగా.. ఇంకా తీసుకోనివారు <>tgbieht.cgg.gov.in<<>> సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తారు. ALL THE BEST

News February 24, 2026

కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం

image

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పేరును కేరళంగా మారుస్తూ తీర్మానం చేసింది. కేంద్రం సైతం ఇదే పేరును గుర్తించాలని ప్రతిపాదించింది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలోని ఫస్ట్ షెడ్యూల్‌లోనూ కేరళను కేరళంగా మార్చేలా సవరణలు చేపట్టాలని కోరింది. తాజాగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.