News January 3, 2026
హైకోర్టులో కేసు వేసిన వేదిక్ యూనివర్సిటీ VC

TTD శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ రాణి సదాశివమూర్తి హైకోర్టులో ‘WRIT PETITION’ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, TTD, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ను అందులో ప్రతివాదులుగా చేర్చారు. VC పదవికి ఆయన అనర్హుడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. TTD బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
Similar News
News January 14, 2026
ఏలూరు MPకి బెదిరింపులు.. రూ.10 కోట్లు డిమాండ్

ఏలూరు MP పుట్టా మహేశ్తోపాటు ఆయన తండ్రి మైదుకూరు MLA సుధాకర్ యాదవ్ను బెదిరించిన కేసులో ముంబయికి చెందిన నిందితుడు రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. RTI కార్యకర్తనని, ఆస్తులను జప్తు చేస్తానని ఈ-మెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. రూ.10 కోట్లు ఇస్తే వదిలి పెడతానని MPని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు దక్షిణ ముంబయిలో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు.
News January 14, 2026
రేపు, ఎల్లుండి విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్ఫైనల్లో పంజాబ్ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమ్లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.
News January 14, 2026
20న పోలీస్ కమిషనరేట్లో కైట్ ఫెస్టివల్

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న భారీ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ‘అరైవ్ అలైవ్’ (#ArriveAlive) ప్రచారంలో భాగంగా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గాలిపటాలు ఎగురవేస్తూనే ప్రయాణ భద్రతపై అవగాహన పెంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆకాశంలో గాలిపటంలాగే మన ప్రయాణం కూడా సురక్షితంగా సాగాలని అధికారులు ఆకాంక్షించారు.


