News January 4, 2026

సంగారెడ్డి: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

image

సమాజంలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని, దానిని అరికట్టే శక్తి ప్రజల చేతుల్లోనే ఉందని ఉమ్మడి మెదక్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. లంచం అడగడం, తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Similar News

News February 3, 2026

బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

image

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News February 3, 2026

మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

image

గత సీజన్‌లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

News February 3, 2026

నిర్మల్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. ప్రచారానికి గ్రీన్ సిగ్నల్!

image

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాతో స్థానిక రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ అధిష్ఠానం కీలక వార్డుల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. జాబితా వెలువడిన వెంటనే టికెట్ దక్కిన వారిలో ఉత్సాహం వెల్లివిరిసింది. కాంగ్రెస్ శ్రేణులు ఇక నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు.